Telugu cenima news and press notifications,MP3,Video Songs and pictures
Saturday, December 18, 2010
Monday, November 29, 2010
జగన్ ఈగోను దెబ్బ తీశారా?

ముఖ్యమంత్రిగా ఎంపికైనా కిరణ్ కుమార్ రెడ్డిని అభినందించకపోవడం కూడా వైయస్ జగన్ సూపర్ ఈగో వల్లనే అంటున్నారు. కిరణ్ ను అభినందించకుండా తన అంతరంగాన్ని వైయస్ జగన్ బయట పెట్టుకున్నారు. మొదటి నుంచి కూడా వైయస్ జగన్ ఓ ఆధిపత్య భావనతోనే పనిచేస్తూ వస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెసులోనే కాదు, రాష్ట్రంలోనే తనను మించిన నాయకుడు లేడనే ఓ విధమైన ఆధిక్య భావన ఆయనకు శాపంగా మారింది. అందుకే, మిగతా నాయకులతో కలవడానికి ఆయన ఇష్టపడడం లేదు. తానే అందరి కన్నా ఉన్నత స్థాయిలో ఉండాలని, అందరూ తననే గౌరవించాలని, తన మాటే చెల్లుబాటు కావాలని ఆయన కోరుకుంటారు. అదే ఆయనను రాజీనామా దారి పట్టించిందని చెప్పవచ్చు.
మరోవైపు, రోశయ్యను దించేసి కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడంతో తనకు అవకాశం రాదని ఆయన ఒక నిర్ధారణకు వచ్చినట్లు చెప్పవచ్చు. పిసిసి పదివి కూడా ఆయనకు దక్కే అవకాశాలు లేవని స్పష్టంగా తెలిసిపోయింది. దీంతో వైయస్ జగన్ కు బయటకు వెళ్లిపోయి ముఖ్యమంత్రి పీఠం కోసం ప్రయత్నించడం తప్ప మరో మార్గం కనిపించలేదు. పైగా, బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి పార్టీ అధిష్టానం మాటకు తలొగ్గారు. వైయస్ జగన్ కు ఆయన దూరం కావడానికి నిర్ణయించుకున్నారు. వైయస్ వివేకానంద రెడ్డి కాంగ్రెసులోనే ఉండాలని అనుకోవడానికి గల పరిస్థితిని గానీ, వైయస్ వివేకా అంతరంగాన్ని గానీ తెలుసుకోవడానికి వైయస్ జగన్ ప్రయత్నించిన పాపాన పోలేదు. వైయస్ వివేకా చర్యను ఆయన తీవ్రంగా నిరసించారు. వైయస్ వివేకానంద రెడ్డి తనను వ్యతిరేకించడం వల్ల కూడా వైయస్ ఈగో దెబ్బ తిన్నది.
మొత్తం మీద, ఓ సూపర్ మ్యాన్ లా తప్ప మరో రకంగా వైయస్ జగన్ ఉండలేరనేది స్పష్టమై పోయింది. అది ప్రాంతీయ పార్టీలో తప్ప కాంగ్రెసు వంటి జాతీయ పార్టీలో సాధ్యమయ్యేది కాదు. ఆయన మనస్తత్వమే ఆయన రాజీనామా చేయడానికి కారణమైంది.
డిసెంబర్ 1న లేదా 10న వైయస్ జగన్ కొత్త పార్టీ ప్రకటన?

వైయస్ జగన్ సోమవారం రాత్రి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ రైల్లో ఇడుపులపాయకు బయలుదేరి వెళ్లారు. ఇడుపులపాయలో తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత ఆయన బహిరంగంగా మాట్లాడే అవకాశం ఉంది. గురువారంనాడు ఇడుపులపాయకు రావాల్సిందిగా ఆయన తన అభిమానులకు సూచిస్తున్నారు. దాన్ని బట్టి గురువారంనాడు కొత్త పార్టీ గురించి ప్రకటిస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ రోజు కాకపోతే పదవ తేదీన ఆయన తన పార్టీ గురించి మాట్లాడే అవకాశం ఉంది.
కాగా, త్వరలోనే వైయస్ జగన్ పార్టీ పెడతారని వైయస్ జగన్ వర్గానికి చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి చెప్పారు. ఎమ్మెల్సీ రెహ్మాన్ కూడా అదే విషయం చెప్పారు. కొండా సురేఖ వంటివారు మాత్రం పార్టీ గురించి వైయస్ జగన్ తమతో మాట్లాడలేదని అన్నారు
చరణ్ ‘ఆరెంజ్’ పై రకరకాల కాంటెస్ట్ లు రకరకాల ప్రైజ్ లు..

ఈ కాంటెస్ట్ వల్ల ఆరెంజ్ కి కొత్తగా యాడ్ అయ్యే బెనిఫిట్ ఏమిటో తెలీదు కానీ ఫాన్స్ కి మాత్రం చరణ్ ని ఇది మరింత దగ్గర చేస్తోంది. ముఖ్యంగా ఆరెంజ్ చిత్రానికి వస్తున్న బ్యాడ్ టాక్ ని కూడా చరణ్ పట్టించుకోకుండా ప్రయత్నం వరకే తనది, ఫలితం తన చేతుల్లో లేనిది అన్నట్టు ప్రవర్తిస్తుండటం వారికి ఆనందాన్నిస్తోంది.
చిరంజీవి పార్టీలో చిచ్చు: కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందా?

కాగా, తన ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదనే దీమాతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అందుబాటులో ఉన్న శాసనసభ్యులతో, ఎమ్మెల్సీలతో సమావేశమై ఆ మేరకు ఆయన హామీ ఇచ్చారు. వైయస్ జగన్ వర్గం ప్రయత్నాలను ఎదుర్కోవాలని ఆయన సూచించారు. ప్రస్తుతం కాంగ్రెసుకు శాసనసభలో 156 మంది శాసనసభ్యులున్నారు. ప్రజారాజ్యం పార్టీకి 18 మంది, తెలంగాణ రాష్ట్ర సమితికి 11 మంది, మజ్లీస్ కు ఏడుగురు, సిపిఐకి ఏడుగురు, సిపిఎంకు ఒక్కరు, తెలుగుదేశం పార్టీకి 90 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఇతరులు ముగ్గురు ఉన్నారు. శాసనసభలో ప్రభుత్వానికి కనీసం 147 మంది శాసనసభ్యుల బలం అవసరం. వైయస్ జగన్ వర్గం వెళ్లిపోయినా అంతకన్నా ఎక్కువే బలం ఉంటుందని కాంగ్రెసు అధిష్టానం విశ్వాసంతో ఉంది. వైయస్ జగన్ వెంట 15 మందికి మించి శాసనసభ్యులు వెళ్లిపోరనే విశ్వాసంతో ఉంది. ఆ మేరకు ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు 16 మంది మద్దతిస్తారని భావిస్తున్నారు. ఎక్కువలో ఎక్కువగా జగన్ వెంట 26 మంది శాసనసభ్యులు వెళ్లిపోయినా నష్టం లేదనే భావనతో కాంగ్రెసు నాయకత్వం ఉంది.
తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సిద్ధంగా లేదని, అందు వల్ల ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ముందుకు రాదని అంటున్నారు. మజ్లీస్ కూడా కాంగ్రెసు వైపే ఉండే అవకాశం ఉంది. తెరాస మద్దతివ్వకపోవచ్చు. తెరాస మద్దతు తీసుకోవాలంటే పెద్ద కసరత్తే చేయాల్సి ఉంటుంది. తెలంగాణ డిమాండ్ ను ఆ పార్టీ మరోసారి ముందుకు తేవచ్చు. అందువల్ల తెరాస మద్దతు తీసుకునే వైపుగా ఆలోచన చేయకపోవచ్చు. ఇతరులను కూడా తమ వైపు తిప్పుకోవడానికి అవకాశం ఉంటుందని కాంగ్రెసు నాయకులు అంటున్నారు. ప్రభుత్వం పడిపోదని వైయస్ జగన్ వర్గానికి చెందిన గోనె ప్రకాశ రావు స్వయంగా చెప్పారు. ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన వైయస్ జగన్ కు లేదని వైయస్ జగన్ వర్గానికి చెందిన నాయకులు కూడా చెబుతున్నారు. పరిస్థితిని గమనించే జగన్ వర్గం ఆ విధమైన వాదనలను ముందుకు తెచ్చి ఉంటారని భావిస్తున్నారు.
కాగా, వైయస్ జగన్ వెంట ఎవరూ వెళ్లరని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు స్పష్టం చేశారు. వైయస్సార్ పై సానుభూతితో అప్పట్లో వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని 150 మంది సంతకాలు చేశారని, తాను కూడా సంతకం చేశానని, ఆ పరిస్థితి ఇప్పుడు లేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. జగన్ మాటల్లో రాజకీయ పరిపక్వత లేదని ఆయన విమర్సించారు. ఎవరో పార్టీ పెడతారని కాంగ్రెసును వీడి వెళ్లేది లేదని ఆయన అన్నారు. వైయస్ జగన్ కు అత్యంత సన్నిహితుడైన లోకసభ సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా రాజీనామా చేసే విషయంపై పునరాలోచన చేస్తానని చెప్పారు. రోజులు గడుస్తున్న కొద్ది వైయస్ జగన్ కు మద్దతు తగ్గుతూ పోతుందని కాంగ్రెసు అంచనా. దానివల్ల కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదని అంటున్నారు
ఆ హీరోయిన్ కి పోటీ ఉండకూడదనే ఆ ఇద్దరితో కలసి అలా చేసింది..!
డిసెంబర్ లో అనుష్క నటించిన రగడ, నాగవల్లి రెండూ ఒక్క రోజు వ్యవధిలో విడుదల కానున్నాయి. వరుస ఫ్లాపులతో డీలా పడ్డ అనుష్క ఈ రెండు చిత్రాలతో మళ్లీ ఫామ్ లోకి రావాలని చూస్తోంది. ‘మగధీర’ తో కాజల్ పుంజుకున్నాక అనుష్కకి కాంపిటీషన్ ఎదురైంది. ఆ తర్వాత కొద్ది రోజులకే సమంత రావడంతో ఇంకో పోటీదారు పెరిగింది. వీళ్లిద్దరికీ ఈ రెండు చిత్రాలతో అనుష్క చెక్ పెట్టాలని చూస్తోంది. రగడతో గ్లామరస్ హీరోయిన్ గా తనకు తిరుగు లేదని ప్రూవ్ చేసుకునేందుకు, ‘నాగవల్లి’గా నటిగా తనకు ఎదురులేదని చాటుకునేందుకు అనుష్క ఆరాటపడుతోంది. అయితే అనుష్క ఇప్పుడెంతగా ట్రై చేసినా ఇంకో రెండేళ్లలో పెట్టె సర్దుకోక తప్పదని, ఇప్పటికే ఆమె బాడీలో చాలా డిఫరెన్స్ వచ్చిందని సినీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.
Sunday, November 28, 2010
The new girlfriend on Gopichand

నేను "ఆరెంజ్" చేయటానికి కారణమేమిటంటే...రామ్ చరణ్

ఇక నేను పర్శనల్ గా నమ్మేది ఒక సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను సంతృప్తి పరచలేదని. ఇక మూడవది..ఈ చిత్రంలో ఫెవరెట్ సీన్ ..రూబతో విడిపోయే సన్నివేశం. భాస్కర్ ఆ సీన్ నాకు చెప్పేటప్పుడు చాలా ఫీల్ అయ్యాను. ఇక నాలువది..ఈ చిత్రంలో హల్లో రమ్మంటే ..రూబా పాటలు చేస్తున్నప్పుడు చాలా ఉషారుగా అనిపించింది అని మనస్సు విప్పి చెప్పారు. ఇక ఆరెంజ్ చిత్రం ఈ శుక్రవారం విడుదలై ఓ కన్ఫూజ్ లవ్ స్టోరీగా పేరు తెచ్చుకుంది.అయితే రామ్ చరణ్ స్టైల్స్ కి మాత్రం మంచి పేరు వచ్చింది.
Subscribe to:
Posts (Atom)